రెయిన్‌ ఎఫెక్ట్‌: ఓయూ పరీక్షలు వాయిదా..

-

వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి..ఈ నేపథ్యంలో ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.. సోమ, మంగళ, బుధవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ ప్రకటించింది.


హైదరాబాద్‌లో భారీవర్షాలతో నగరవాసి బెంబేలెత్తిపోతున్నాడు. చెరువులను తలపిస్తున్న రహదారులపై వెళ్లడం సాహసంగా మారింది. వచ్చే మూడు రోజులు వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా చేశారు అధికారులు..అయితే 22 నుంచి జరగాల్సిన యధాతథంగా జరుగుతాయని ఓయూ అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news