ఇంటి గుమ్మానికి మిర్చి- నిమ్మకాయలు ఎందుకు కడతారో తెలుసా .?..ఆత్మలు పోవటానికి కాదట..!

-

భారతదేశం ఆచార సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఎన్నో ఆచారాలు, మరెన్నో సంప్రదాయాలు. వీటికితోడు చరిత్రను చెప్పే ఆలయాలు.. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర. ఇక ఆచారాలు అయితే ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో పరిమితం కావు..యావత్ దేశం కొన్ని ఆచారాలను బలంగా నమ్ముతుంది. అయితే మనం పాటించే ఈ ఆచారాల్లో చాలా వాటికి అసలు అర్థం తెలియదు. మన అమ్మ చెప్పిందనో, ఇంకా పెద్దవాళ్లు చెప్పారనే పాటిస్తుంటాం. అందులో ఒకటి ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టటం. సాధారణంగా అందరి ఇంటికి ఇది ఉంటుంది. వీటిని కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే..దిష్టితగలకుండా, ఎలాంటి ఆత్మలు రాకుండా అని మన పెద్దొల్లు చెబుతుంటారు. కానీ అసలు కారణం వేరే ఉందట..అదేంటంటే..

పూర్వం చాలా మంది మట్టి ఇళ్ళలో ఉండే వారు. దాంతో పురుగులు, దోమలు వంటివి ఇళ్లల్లోకి ఎక్కువగా వచ్చేవి. అప్పుడు ఇప్పుడు ఉన్నట్టు మస్కిటో కాయిల్స్ లాంటి కెమికల్ పదార్థాలు లేవు. నిమ్మకాయ, మిరపకాయల్లో విటమిన్ సి ఉంటుంది. మిరపకాయలో అయితే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మనం నిమ్మకాయని దారానికి గుచ్చినప్పుడు ఆ దారానికి అంటుకొని ఆ ప్రదేశం మొత్తం వ్యాపిస్తుంది. దాంతో దోమలు, ఈగలు లేదా ఇతర కీటకాలు అక్కడికి రాకుండా ఉంటాయి. ఈ కారణంగానే పూర్వంలో నిమ్మకాయ, పచ్చి మిరపకాయలు దారానికి కలిపి కట్టేవారు. ఇదే పద్ధతిని మనం తరతరాల నుండి ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నాం.

ఇంకా సాయంత్రం అయితే గోల్లు కత్తిరించకూడదు, ఇల్లు ఊడ్చకూడదు అంటారు. ఏమన్నా అంటే అరిష్టం అంటారు. కానీ దానికి అసలు కారణం ఏంటంటే..పూర్వం రోజుల్లో కరెంటు ఉండేదికాదు. రాత్రిపూట ఇల్లు ఊడిస్తే ఇంట్లో ఉండే ఏమైనా విలువైన వస్తువులు బయటకువెళ్లిపోయే ప్రమాదం ఉంది. బంగారం లాంటివి. ఇంకోటి..ఇప్పుడంటే డైనింగ్ టేబుల్స్, సపరేట్ కిచిన్స్ వచ్చేశాయి. కానీ పూర్వం అలాకాదు..అంతా ఒకే దగ్గర ఉంటుంది. కింద కుర్చునే తినేవారు. కాబట్టి సాయంత్రం సమయంలో గోళ్లు తీస్తే అవి తెలియకుండా అక్కడే ఉంటే..అసలే చీకటి..ఏదో లైట్ బుడ్డీవెలుగులో తింటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ గోల్లు ఏమైనా తినే ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. అందుకే మన అమ్మమ్మలు ఇప్పుడు కూడా రాత్రుల్లు జుట్టుదువ్వుకోకూడదు అని చెప్తుంటారు. దానికి కూడా ఇదే కారణం.

ఇదండి మ్యాటర్..ఇలా మన పూర్వీకులు సైన్స్ తెలియనిరోజుల్లోనే ఆచారాల పేరిట ఎన్నో చేసేసారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. మార్కెట్లోకి కొత్తకొత్త వస్తువులు వచ్చేశాయి. కానీ మనం అని ఆచారాలే అనుకుని పాటిచ్చేస్తున్నాం. మనం చెప్పినా మన పెద్దొల్లు వినరు అని మీకు అనిపించే ఉంటుంది కదా..ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు.

Read more RELATED
Recommended to you

Latest news