బిలంలో అమరలింగేశ్వరాలయం ఎక్కడో తెలుసా!

-

పవిత్ర స్థలాలు దాదాపు కొండలపై, లోయల్లో, గుహల్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అటువంటి కోవలోకి వచ్చే ఒక పవిత్ర క్షేత్రం ఇది. గుహలో శివలింగం. అచ్చెరువు నొందించే ఈ బిలంలోని దేవాలయ విశేషాలు తెలుసుకుందాం… గుంటూరు జిల్లా గురజాలకు 6 కి.మీ దూరంలో ఉన్న దైద గ్రామంలోని మహిమాన్వత శ్రీ అమర లింగేశ్వరస్వామి ఆలయం. సుందర అటవీ ప్రాంతం, పవిత్ర కృష్ణానది తీరంలో ఈ ఆలయ పరిసర ప్రాంతం మనోహరంగా ఉంటుంది. ఈ దేవాలయం వెలుగులోకి వచ్చి 120 ఏండ్లు అయ్యింది. ఐనా ఈ దేవాలయం కొన్ని వందల ఏండ్ల క్రితమే ఇక్కడ శివుడు స్యయంభూగా శివలింగం రూపంలో ఒక కొండ బిలంలో వెలిసినట్లు చారిత్రక కథనాలు ఉన్నాయి. ఈ ప్రశాంత వాతావరణంలో సిద్దులు, రుషులు, దివ్య పురుషులు ఇక్కడకు వచ్చి శివున్ని ఆరాధించేవారు. ఈ అడవి ప్రాంతంలో దైద, తేలుకుట్ల, గొట్టిముక్కలకి చెందిన పశువుల కాపరులు తమ పశువులను మేతకు తీసుకెళ్లేవారు.

ఒకరోజు ఇప్పుడున్న దేవాలయ కొండ ప్రాంతంలో పశువులు మేపుతుండగా ‘ఓం నమశివాయః’ అంటూ శబ్దం వినిపించింది. దీంతో పశువుల కాపరులు కొండ వద్దకు వెళ్లి కొండ చుట్టూ శబ్దం వచ్చిన వైపు వెళ్లగా ఒక బండ రాయి నుండి శబ్దం వస్తున్నట్లు గ్రహించి, ఆ రాయిని తొలగించగా కొండ లోపలికి ఒక సొరంగ మార్గం కనిపించింది. పశువుల కాపరులు ఆ బిలం గుండా అతి కష్టమైన ఇరుకు దారిలో వెళ్లి చూడగా ఒక అధ్బుత దృశ్యం గోచరించింది. అక్కడ ఒక శివలింగానికి కొందరు పెద్ద గడ్డాలతో ఉన్న రుషులు ఉన్న అభిషేకం చేస్తూ, శివ స్తోత్రం చేస్తున్నారు. పశువుల కాపర్లకు వారి దగ్గరకు వెళ్లేందుకు దైర్యం చాలక వెనుకకు వచ్చి దగ్గరలో పొలంలోపని చేస్తున్న కొందరికి చెప్పగా, వారు చూద్ద్దాం పదండి అంటూ పశువుల కాపరులు తో కలసి ఆప్రాంతానికి వచ్చారు. అందరు లోపలికి పోయి చూడగా అక్కడ రుషులు కనపడలేదు, కాని శివలింగానికి పూజ చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అంతట వారు తన్మయత్వంతో శివలింగం కి పూజ చేసి బయటకు వచ్చి ఈ అద్బుత విషయం ప్రజలందరికి తెలియచేసారు. అక్కడకు వెళ్లి చూసిన ఆయా గ్రామ ప్రజలు కీకారణ్యంలో కొండలో గుహలో శివలింగం వెలసిన తీరు చూసి భక్తి పరవశులయి పూజలు చేయ ప్రారంభించారు. దేవతలు అంటే అమరులు ఆరాధించిన శివలింగం కాబట్టి అమర లింగేశ్వరస్వామి గాపేరు వచ్చినట్లు చెప్తారు.

ఈ కొండ బిలం చూసిన ప్రతి వారు ఆశ్ఛర్యం పొందుతారు.ఇదంతా ఆ శివుని లీల అని భావిస్తారు.అప్పటి నుంచి ఈ దేవాలయానికి భక్తులు సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రతి సోమవారం ఇక్కడ కు భక్తులు వచ్చి పొంగళ్లు పెట్టి శివున్ని ఆరాదించి ఇక్కడే నిద్ర చేస్తారు. అలా చేస్తే వారి కోరికలు తీరతాయని నమ్మకం. సంతానం లేనివారు, రోగగ్రస్తులు ఈ స్వామి దర్శిస్తే సంతానం కలుగుతుందని,అలాగే రోగాలు నయమవుతాని భక్తులు తమ ప్రత్యక్ష అనుభవాలు చెపుతారు. ఒకప్పుడు ఈ ప్రాంతానికి సరైన రవాణా మార్గంలే దు కాలి నడక గుండా నే అరణ్య మార్గాన వెళ్లాలి. అయినను భక్తులు అధిక సంఖ్యలో వచ్చేవారు, నేడు కొంత వరకు ప్రయాణ సౌకర్యం బాగానే ఉంది. ఆటోలు,కారులు వెళ్ళవచ్చు. పవిత్ర కృష్ణానదిలో స్నాన మాచరించి, తడి బట్టలతోనే బిలంలోకి ప్రవేశించి శివుడిని ఆరాదిస్తారు. ఈ బిలంలోకి జట్టు, జట్టులుగా లోపలికి వెల్తారు. ఎందుకంటే ఈ బిలంలో అనేక మార్గాలు ఉన్నవి. తప్పిపోయే ప్రమాదం ఉంది.

ఎత్తిపోతలకు సొరంగం
ఈ బిలం నుండి ఎత్తిపోతల, కాశీ, త్రిపురాంతకంలకు కూడాసొరంగం నుండి మార్గాలు ఉన్నట్లు పెద్దలు చెపుతారు. ముందు ఒకతను దారి చూపిస్తూ భక్తులను బిలంలోకి తీసుకెళ్లతాడు. ప్రస్తుతం బిలంలో విద్యుత్‌ సౌకర్యం కలదు. ఒక మనిషి మాత్రమే వెల్లేందుకు సన్నని మార్గం ఉంటుంది. ఒకరి వెనుక ఒకరు వెళ్లాలి. కొన్ని చోట్ల వంగుతూ,మోకాళ్ల పైన కూడా లోపలికి వెళ్లాలి. బిలంలో అనేక మార్గాలు కనిపిస్తాయి, ముందు తెలిసిన వారు వెళుతుండే వారి వెనుక అనుసరించాలి. శివలింగం ఉన్న ప్రదేశం మాత్రం 10 మంది కూర్చుని అభిషేకం చేసుకునేలా ఉంది. ఆ ప్రాంతం పంచాముఖాకృతిలో వాస్తు రీతిలో ఉంటుంది.శి వునికి ఇక్కడ ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. బిలంలోనే ఒక పక్క పార్వతి అమ్మగారి ప్రతిమ భక్తి భావం ఇంకా పెంచుతుం ది. ప్ర కృతి ప్రేమికులకు ఈ ప్రాంతం చూస్తే ముగ్దులవుతారు.రాత్రి వేళ ఇక్కడ నిద్ర చేసే భక్తులను ఆశీర్వదించటానికి ఇక్కడ శివుడు సంచరిస్తు ఉంటారని పెద్దలు చెపుతారు. మనోహర్‌ అడవి ప్రాంతం,పరవళ్లు తొక్కే నీరు,ప్రశాంత వాతావరణం కనులు విందు చేస్తుంది. ఒకప్పుడు బిలంలోకి పోవటానికి, రావటానికి ఒకే మార్గం ఒకే మార్గం ఉండేది, కాలక్రమేణా మరోదారి కనిపించగా బండ రాయి తొలగించగా మరో మార్గం కనిపించదట,అప్పుటి నుండి ఈ మార్గం గుండా భక్తులు బయటకు వస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news