అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి రథోత్సవం

-

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రథోత్సవం వేడుకగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో రథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు విహరించారు.

తిరుమల శ్రీనివాసుడి రథోత్సవాన్ని తిలకించేందుక పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. పలువురు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి రథాన్ని లాగారు. భక్తుల జయ జయ ధ్వానాలు.. గోవిందనామ స్మరణల మధ్య మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. శ్రీ వేంకటేశ్వరుడి నామాలతో శ్రీవారి ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది.

Read more RELATED
Recommended to you

Latest news