’10వ తరగతి పరీక్ష ఫీజు ఈ నెల 29 లాస్ట్’

-

సూర్యాపేట: ఏప్రిల్ నెలలో జరగనున్న 10వ తరగతి రెగ్యులర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 29వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. విద్యార్థులు చెల్లించిన పరీక్ష ఫీజును ప్రధానోపాధ్యాయులు ఈనెల 31వ తేదీ లోపు కార్యాలయంలో జమ చేయాలని చెప్పారు. రూ. 50 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 10 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో మార్చి 3 వరకు చెల్లించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news