వరంగల్: రేషన్‌ సరఫరా సర్వర్‌ మోరాయింపుతో ఇబ్బందులు

-

వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా సర్వర్‌ మొరాయింపుతో రేషన్‌ పంపిణీలో ఆలస్యమవుతోంది. గత నాలుగు రోజుల నుంచి సర్వర్‌ డౌన్‌ ఉందని, పలు చోట్ల రేషన్‌ లబ్ధిదారులు గొడవపడుతున్నారని డీలర్లు వాపోతున్నారు. ఈపాస్‌ సర్వర్‌ సిగ్నల్‌ సరిగ్గా ఉండకపోవడంతో ఒక్కొక్కరికి 20నుంచి 40 నిమిషాల సమయం పడుతోందని డీలర్లు తెలిపారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్‌నాయక్‌ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news