సిరిసిల్ల: అటవీ ప్రాంతంలో ఆదిమానవుల ఆనవాళ్లు

-

కోనరావుపేట మండలం ధర్మారం అటవీ ప్రాంతంలోని వెంకటేశ్వరాలయం, మైసమ్మ గుట్ట ప్రాంతంలో 1500 ఏళ్ల నాటి ఆదిమానవుల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆదిమానవుల సమాధులు ఉన్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఆలయాల్లోని దేవతలను, ఆది మానవుల ఆనవాళ్లను ప్రజలు దర్శించుకుంటున్నారు. ప్రభుత్వం, పురావస్తుశాఖ అధికారులు వీటిని వెలికితీసేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ గున్నాల అరుణ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news