జాతీయ స్థాయి పోటీల్లో వరంగల్ విద్యార్థుల ప్రతిభ

-

నర్సంపేట పట్టణానికి చెందిన నాట్యవేద కళాక్షేత్రం విద్యార్థులు కూచిపూడిలో ప్రతిభ చాటుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన కూచిపూడి జాతీయ స్థాయి పోటీల్లో నర్సంపేటకు చెందిన విద్యార్థులకు శివపార్వతులు, విశిష్ట మహిళా పురస్కార్‌ అవార్డులు దక్కాయి. 18మంది విద్యార్థులు పాల్గొనగా, అందరూ రాణించినట్లు కళాక్షేత్రం గురువర్యులు పరంజ్యోతి తెలిపారు. దీంతో పలువురు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news