సూర్యాపేట: టిప్పర్ ఢీకొని టీచర్ మృతి

-

సూర్యాపేట: కుడకుడ రోడ్డులో టిప్పర్ ఢీకొట్టడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ (ఎస్) మండలం గట్టికల్లుకు చెందిన శ్యాంసన్(56) మహబూబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో నిధులు నిర్వహిస్తున్నారు. సెలవు దినం కావడంతో సూర్యాపేట పట్టణంలోని ఓ చర్చిలో ప్రార్థనల కోసం వచ్చాడు. అనంతరం తన బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news