BREAKING : మేకపాటి మృతి.. హైదరాబాద్‌ బయలు దేరిన సీఎం జగన్‌

-

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. కాసేపటి క్రితమే మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండె పోటు రావడంతో.. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. మరణించారు. దీంతో వైసీపీ పార్టీ లో విషాదం చోటు చేసుకుంది. ఇక మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మరణ వార్త విన్న ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. హుటా హుటిన హైదరాబాద్‌ బయలు దేరారు.

ప్రత్యేక హెలికాప్టర్‌ లో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌ వస్తున్నారు. నేరుగా జూబ్లిహిల్స్‌ అపోలో ఆస్పత్రికి సీఎం జగన్‌ వెళ్లనున్నారు. ఇది ఇలా ఉండగా. మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్మరణం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త బాధించిందని….చిన్న వయస్సులోనే ఆయన మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరమన్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news