వరంగల్‌లో విషాదం.. భర్త మృతిని తట్టుకోలేక..!

-

కట్టుకున్న భర్త అనారోగ్యంతో మృతి చెందగా, అది తట్టుకోలేక భార్య గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన వరంగల్‌లోని గరీబ్‌నగర్‌లో జరిగింది. జెట్టి రవీందర్ కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం చనిపోయాడు. భర్త మృతితో భార్య ప్రేమలతకు గుండెపోటు వచ్చి మృతి చెందింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. ఒకే కుటుంబంలో ఇద్దరి చనిపోవడంతో వరంగల్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news