ఇరాన్ మీద అమెరికా కరోనాతో యుద్ధం చేస్తుందా…?

-

కరోనా వైరస్ ఇరాన్ లో నమోదు అయింది. అసలు ఇరాన్ కి ఇన్నాళ్ళు వెళ్ళని కరోనా వైరస్ నేరుగా అక్కడికే ఎందుకు వెళ్ళింది…? అమెరికాకు దీటుగా ఎదుగుతున్న దక్షిణ కొరియా కు కూడా కరోనా వైరస్ వెళ్ళింది. ఇది ఏ విధంగా సాధ్యం అయింది అసలు…? ఇన్నాళ్ళు వెళ్ళని కరోనా ఇన్ని చర్యలు తీసుకున్న తర్వాత కూడా ఈ విధంగా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ఏంటి..?

లేదు దీని వెనుక ఏదో జరుగుతుంది. అవును కరోనా తో అమెరికా దక్షిణ కొరియా ను కూడా టార్గెట్ చేసింది. లేకపోతే భారత్ ని, పాకిస్తాన్ ని చైనా ఆనుకుని ఉంది. ఈ రెండు దేశాల్లో నమోదు అయింది మొత్తం కలిపినా 20 కేసులు లేవు. ఏ సంబంధం లేని ఇరాన్ లో రెండు నగరాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇరాన్ లో 20 మంది చచ్చిపోయారు. అంటే దీనికి కారణం ఏంటి…? అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చ ఒక్కటే.

కరోనా వైరస్ చైనా లో పుడుతుంది అనే విషయం ముందే అమెరికాకు స్పష్టంగా తెలుసు. వెంటనే అమెరికా.. తన పౌరులను చైనా లో కాళీ చేయించింది. ఇరాన్ మీద అమెరికా కక్ష గట్టింది. అక్కడ కూడా ఇదే విధంగా వైరస్ ని వ్యాప్తి చేసింది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఆర్ధికంగా కూడా చైనాకు అమెరికాకు మధ్య పోటీ ఉంది. అందుకే ఇప్పుడు చైనాను ఇరాన్ ను అమెరికా టార్గెట్ చేసింది.

దక్షిణాసియాలో భారత్ అమెరికాకు దీటుగా ఎదిగే అవకాశం లేదు. చైనా నుంచి ఆయుధాలను కూడా భారత్ కొనే అవకాశం లేదు. ఇరాన్ నుంచి అమెరికాకు ఇబ్బందులు ఉన్నాయి. భారత్ ఎలాగూ ఆయుధ సంపత్తి విషయంలో అమెరికా మీద ఆధారపడాలి. చైనా ఈ దెబ్బతో ఆర్ధికంగా కోలుకునే అవకాశం లేదు. అదే విధంగా ఇరాన్ కూడా మధ్య ప్రాచ్యంలో తన ప్రాభవం కోల్పోయే అవకాశం ఉంది.

ఇరాన్ సరిహద్దు దేశాలు ఏమీ కూడా ఆ దేశంతో వాణిజ్యం పెట్టుకోకుండా కరోనా భయపెట్టే అవకాశం ఉంది. అందుకే అమెరికా ఈ విధంగా ప్లాన్ చేసింది అంటున్నారు. దక్షిణ కొరియా కూడా ఆర్ధికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టే ఈ విధంగా ప్లాన్ చేసి ఆ దేశాన్ని కూడా దెబ్బ కొట్టింది అంటున్నారు. అమెరికాతో ప్రత్యక్ష పరోక్ష స్నేహంలో ఏ దేశం కూడా కరోనా తో ఇబ్బంది పడకపోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news