గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే షాక్‌..!

-

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే షాక్ ఇచ్చింది. వాస్త‌వానికి ఉద్యోగాలు పొందినవారిలో ఎక్కువ మంది గ్రూప్‌ పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులే ఉన్నారు. ఇప్పటికే గ్రూప్‌-2, 3 పరీక్షలు రాసిన వారు ఫలితాల్లో మంచి మార్కులొస్తే ఆ ఉద్యోగాలకు వెళ్లే అవకాశముంది. కానీ.. తాజాగా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ప్రభుత్వం పెట్టిన నిబంధన గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఝలక్‌ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారు రెండేళ్లు ప్రొబేషనరీ ఉంటుందని వారికిచ్చిన ఆర్డరల్లో పేర్కొన్నారు.

అంతేకాదు ప్రతి ఉద్యోగి మూడేళ్లు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుందని, మధ్యలో ఉద్యోగం మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. దీంతో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందుకున్న అనేక మంది అభ్యర్థుల‌ను అయోమయంలో పడేసింది. నోటిఫికేషన్‌లో రెండే ళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ పనిచేయాలని పేర్కొన్నారని, మూడేళ్లు ఖ‌చ్చితంగా పనిచేయాలన్న నిబంధన అందులో లేదని పలువురు చెబుతున్నారు. ఈ నిబంధనలు పెట్టడంతో అభ్యర్థులు దిక్కు తోచ‌ని ప‌రిస్థితిలో ఉన్నారు. కొంతమంది అభ్యర్థులు ఈ ఉద్యోగం వదిలేసుకుందాంలే అన్న భావనకొచ్చినట్లు స‌మాచారం..

Read more RELATED
Recommended to you

Latest news