గ్రామ సచివాలయ ఉద్యోగులకు మరో అదిరిపోయే ఆఫ‌ర్‌..

-

గ్రామ స‌చివాల‌య ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌. గ్రామ సచివాలయ ఉద్యోగులకు మరో అద్భుత అవకాశం ఏంటంటే.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వేరే చోట పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఉద్యోగి సొంత మండలంలో మరే గ్రామమైనా.. జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. పోస్టింగ్‌ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.

అయితే.. ఒకవేళ ఒక పోస్టుకు ముగ్గురు ఉద్యోగులు పోటీ పడినప్పుడు వేరే గ్రామాల్లో రెండు, మూడు స్థానాల్లో అవకాశం కల్పించనున్నారు. కాగా ఉద్యోగులకు ఈ పోస్టింగ్‌ని.. జిల్లా సెలక్షన్ కమిటీ ఇస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే.. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news