Telangana Inter Re verification Results: ఫలితాలను చెక్ చేసుకోండి ఇలా..!

-

తెలంగాణలో ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డు రిలీజ్ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు మే 27న ఇంటర్ బోర్డు ఫలితాలను ప్రకటించింది. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ లో 1137 మంది విద్యార్థులు పాస్ అయినట్టు ఇంటర్ బోర్డు తెలిపింది.

telangana-inter-re-verification-results released

ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 585 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 552 మంది పాస్ అయ్యారు. ఒక్క మార్కుతో పాస్ అయినవాళ్లు 88 మంది కాగా… రెండు మార్కులతో పాస్ అయిన వాళ్లు 156 మంది, మూడు మార్కులతో పాస్ అయిన వాళ్లు 161 మంది, నాలుగు మార్కులతో పాస్ అయిన వాళ్లు 140 మంది, 5 మార్కులతో పాస్ అయిన వాళ్లు 95 మంది, 6 మార్కులతో పాస్ అయిన వాళ్లు 497 మంది ఉన్నారు.

ఫలితాలను bie.telangana.gov.in వెబ్ సైట్ లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ వివరాలు మూడు రోజుల్లో వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు తెలిపింది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన 3,82,116 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్స్ రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది.

Read more RELATED
Recommended to you

Latest news