బిగ్ బాస్ టైటిల్ విన్న‌ర్ ఎవ‌రో అవ్వాలో చెప్పిన యాంక‌ర్ రష్మీ..

-

సాధార‌ణంగా జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్ తెలియ‌ని వారుండ‌రు. అయితే ఆమె సోషల్‌ మీడియా వేదికగా బిగ్ బాస్‌లో త‌న‌కు ఇష్ట‌మైన కంటెస్టెంట్‌కు మద్దతు తెలిపింది. బిగ్ బాస్ 3 చివరి దశకు చేరుకుంది. మరో పది రోజుల్లో ఈ షో ముగియనుంది. పదహారు మందితో మొదలైన ఈ షోలో ఇప్పుడు ఆరుగురు మాత్రమే మిగిలారు. అయితే మిగిలిన ఆరుగురులో ఎవరు విన్నర్ గా అవుతారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఇప్పటికే రాహుల్ ఫైనల్ కి చేరిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఎవరి ఫాన్స్ వారికే సపోర్ట్ చేస్తూ విజయం సాధించాలని కోరుకుంటున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ బిగ్ బాస్ లోని శ్రీముఖికి మ‌ద్ద‌తు తెలిపింది. తను నాకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పుకొచ్చింది. గేమ్‌ అద్భుతంగా ఆడుతోందని.. దాన్ని అలాగే కొనసాగిస్తూ టైటిల్‌ కొట్టాలని కోరింది. ఇక బయట ఎలా ఉంటుందో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉంటుందని చెప్పుకొచ్చింది రష్మి. ఇక జబర్దస్త్‌ కమెడియన్‌ ఆటో రాంప్రసాద్‌ కూడా శ్రీముఖికి అండగా నిలిచాడు. శ్రీ‌ముఖినే విన్న‌ర్ అవ్వాల‌ని.. అవుతుంద‌ని వారి మ‌ద్ద‌తు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news