బిగ్‌బాస్: హేమ రీ ఎంట్రీ.. శ్రీముఖికి సూప‌ర్ పంచ్‌

-

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే అయిదుగురు అని టక్కున చెప్పేస్తారు. ఎందుకంటే మ‌రో రెండు రోజుల్లో ఫైన‌ల్ జ‌రుగుతోంది. మొత్తం హౌస్లో ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఒక‌రు బిగ్‌బాస్ విన్న‌ర్ అవుతారు. అయితే ఇప్పుడు హౌస్‌మెట్స్‌కు బిగ్‌బాస్ స‌డెన్ స‌ర్‌ఫ్రైజ్‌లు ఇస్తున్నాడు. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన కంటెస్టెంట్ల‌ను ఈ రోజు తిరిగి హౌస్‌లోకి ప్ర‌వేశ‌పెడుతున్నాడు.

వీరు చేసే అల్లరితో నేటి ఎపిసోడ్‌ దద్దరిల్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో విడుదలైంది. ఇందులో హేమ జాఫర్‌, అషూ రెడ్డి, రోహిణి, వితిక, పునర్నవి, రవి, మహేశ్‌, శివజ్యోతి, హిమజ, తమన్నా, శిల్పా చక్రవర్తి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. వీరంతా మూడు నెల‌ల క్రితం ఎక్క‌డ అయితే ప్ర‌యాణం మొద‌లు పెట్టారో ఇప్పుడు మ‌ళ్లీ అక్క‌డ‌కే వ‌చ్చారు.

వీరు హౌస్‌లో కంటెస్టెంట్ల‌తో మామూలు హంగామా చేయ‌లేదు. ఇక అన్నింటికి మించి హౌస్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ మళ్లీ బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టడం విశేషం. శ్రీముఖి అతివినయం చూపిస్తూ హేమ కాళ్లు పట్టుకోబోయింది. వెంటనే హేమ ‘వద్దమ్మా’ అంటూ ఆమెకో నమస్కారం పెట్టి పెద్ద షాకే ఇచ్చింది.

ఇక హేమ బిగ్‌బాస్ అనేది ఓ చెత్త అని… అక్క‌డ శ్రీముఖికి అంతా ఫేవ‌ర్‌గా జ‌రుగుతోంద‌ని కూడా విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు హౌస్‌లోకి వెళ్ల‌నంటూనే మ‌ళ్లీ ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news