బ్రేకింగ్: సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఏపీ సర్కార్

-

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో అంతా అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అవును.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు రద్దుచేయడంపై.. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

అదేవిధంగా రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌ గా తమిళనాడుకు చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి. కనగరాజ్‌ ను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు రద్దు చేస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో న్యాయస్థానం తీర్పుపై సంతృప్తి చెందిన ప్రభుత్వం… న్యాయ నిపుణుల సలహాలను తీసుకుని తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news