అయోధ్య పుణ్యమా అని మాకు తిండి దొరికింది…!

-

దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కోట్లాది మంది హిందువుల కల నెరవేరుతుంది. భారత దేశం మొత్తం ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. మరి కాసేపట్లో ప్రతీ హిందువు కూడా గర్వ పడే విధంగా రామాలయ నిర్మాణంకు సంబంధించి పునాది రాయి పడుతుంది. వేద పండితుల మంత్రాల నడుమ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది.

ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఇదిలా ఉంటే దేశం మొత్తం కూడా రాముడి గుడి కోసం గానూ.. దీపాలు వెలిగిస్తున్నారు. దీనితో… అస్సాం రాష్ట్రంలోని దిబ్రాఘర్ లో మట్టి దీపాలు తయారు చేస్తున్నారు. దీనిపై ఒక కుమ్మరి మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా మేము చాలా బాధపడ్డామని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలు ఇప్పుడు అయోధ్య కోసం గానూ దీపాలు భారీగా కొంటున్నారు అని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news