కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి

-

కరోనా పోలీసులను బలి తీసుకుంటోంది. మహారాష్టలో ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది పోలీసు అధికారులు మరణించారు. తెలంగాణాలో కూడా ఇప్పటికే ఒకరిద్దరు అధికారులు ఈ మహమ్మారి బారిన పడి మరణించగా ఇప్పుడు ఏకంగా అడిషనల్ ఎస్పీ మరణించడం విషాదకరం. వివరాల్లోకి వెళ్తే కరోనాతో చికిత్స తీసుకుంటూ జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణ మూర్తి మృతి చెందారు.

ఈ రోజు ఉదయం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆయన వారం క్రితం వరకూ డ్యూటీలోనే ఉన్నారు. మొన్న వర్షాలు, వరదలు వచ్చిన నేపధ్యంలో కూడా ఆయన విస్తృతంగా జిల్లలో పర్యటించారు. ఈలోపు కరోనా సోకడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. మరి ఏమయిందో ఏమో ఈరోజు ఉదయం ఆయన మరణించినట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news