మరణించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట కరోనా..టెన్షన్ లో నేతలు !

-

కొన్ని రోజుల క్రితం సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో కన్ను మూశారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కరోనా లాంటిది ఏవీ సోకలేదు. కానీ ఆయన అనారోగ్య సమస్యలతో బాధ‌ప‌డిన ఆయ‌న‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే, ఇప్పుడు ఆయ‌న కుటుంబంలోని కొంత మంది కుటుంబ సభ్యులకి క‌రోనా సోకింది. కొన్ని లక్షణాలు కనిపించడంతో ఈ రోజు వారి ఫ్యామిలీకి పరీక్షలు నిర్వహించారు.

ప‌రీక్ష‌ల్లో రామలింగారెడ్డి సతీమణి సుజాత, ఆయన కుమారుడు సతీష్ రెడ్డితో పాటు మనవడు, మనవరాలికి కూడా కోవిడ్ పాజిటివ్‌ అని తేలింది. సోలిపేట క‌న్నుమూసిన త‌ర్వాత సీఎం కేసీఆర్ స‌హా సహా ప‌లువురు మంత్రులు, టీఆర్ఎస్ కీలక నేతలు చాలామంది అంత్య‌క్రియ‌ల‌కు హాజరయ్యారు. ఇటీవలే రామలింగారెడ్డి కుంటుంబ సభ్యులను పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు కూడా పరామర్శించారు. ఆ త‌ర్వాత సంతాప స‌భ‌కు కూడా పెద్ద సంఖ్య‌లో ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇప్పుడు ఆ కుటుంబంలో క‌రోనా పాజిటివ్‌ అని తేల‌డంతో ముఖ్యమంత్రి సహా అంద‌రిలో ఆందోళ‌న మొద‌లైనట్టే.

Read more RELATED
Recommended to you

Latest news