రాష్ట్రంలో వారం రోజుల పాటు థియేటర్లు మూసివేత…!

-

కరోనా వైరస్ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపటి నుంచి వారం పాటు ప్రభుత్వ స్కూల్స్ ,ప్రైవేట్ స్కూల్స్, సినిమా హాల్స్ అదేవిధంగా ప్రైవేట్ కార్యక్రమాలను రద్దు చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ప్రజలు తమ పనులు కూడా మానుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

అదేవిధంగా వారం రోజుల పాటు యాక్షన్ ప్లాన్ ని యడ్యూరప్ప సర్కార్ ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా హాల్స్ యాజమాన్యాలకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక  షాపింగ్ మాల్స్ ను కూడా బంద్ చేయాలని ఆదేశాలిచ్చింది కర్ణాటక ప్రభుత్వం.

ఇప్పటికే కర్ణాటకలో ఇప్పటికే కర్ణాటకలో 76 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ కారణంగా మరణించాడు. అదేవిధంగా ఒక ఉద్యోగి కూడా కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఐటీ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి అక్కడ ఐటీ కంపెనీలు. బెంగళూరు నుంచి పలు ప్రాంతాలకు విమాన సర్వీసులను కూడా అక్కడి ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news