తెలంగాణా కరోన.. 2,574 కేసులు, 9 మరణాలు !

-

తెలంగాణాలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. గత కొద్దిరోజుల నుండి ఈ కేసులు మూడు వేల లోపే నమోదవుతున్నాయి. ఏపీతో సమానంగా పరీక్షలు చేస్తున్నా ఇక్కడ మాత్రం చాలా తక్కువ కేసులే నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కరోనా కేసులు మళ్ళీ రెండు వేలకి పైనే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 2,574 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,40,969కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 9 మంది కరోనా వలన చనిపోయారు దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 886 కు చేరింది.

ఇప్పటిదాకా కరోనా నుండి 1,07,530 మంది కోలుకోగా నిన్న ఒక్కరోజే 2,927 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 32,553 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 25,449 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 62,736 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 17,30,389కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 325 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా 197 కేసులతో నిలిచింది

Read more RELATED
Recommended to you

Latest news