ఏపీలో ఒకే రోజు ఇద్దరు ఎమ్మెల్యేలకి కరోనా

-

తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కరోనా కేసులతో దూసుకుపోతోంది. త్వరలో అక్కడి కేసులు ఐదు లక్షల మార్క్ కూడా క్రాస్ చేయనున్నాయి. అయితే ఇక్కడ కరోనా కేసులు ప్రజాప్రతినిధులని కూడా టెన్షన్ పెడుతున్నాయి. వరుసగా అక్కడి ఎమ్మెల్యేలకి కరోనా సోకడం టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజా ప్రతినిధులకు కరోనా సోకింది. తాజాగా ఈ ఒక్క రోజే ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. అది కూడా ఇద్దరూ వైసీపీ ఎమ్మెల్యేలకే సోకడం టెన్షన్ పెడుతోంది.

coronavirus
coronavirus

అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి, అలానే కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావులకు కరోనా సోకింది. తిప్పేస్వామి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పారావుకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినా తనకు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్ ‌లోని తన స్వగృహంలో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news