సాక్షాత్తూ అమ్మవారే అక్కడ మాట్లాడతారట.. సైంటిస్టులు కూడా సీక్రెట్ కనిపెట్టలేక సైలెంట్ అయ్యారంటే నిజమేనేమో..!

-

భారతదేశం ఎన్నో వింతలు, విశేషాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఉండే ఆలయాలకు ఓ చరిత్ర ఉంటుంది. మరికొన్నింటికి సైన్స్ కి కూడా అందని రహస్యాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో కేరళాలో ఉండే శ్రీపద్మానాభస్వామి ఆలయం ఒకటైతే.. బీహార్ రాష్ట్రంలో ఉన్న త్రిపురసుందరి ఆలయం మరొకటి. సాధారణంగా ఏదైనా అంతుచిక్కని రహస్యాలుగా ఉంటే.. శాస్ర్రవేత్తలు దిగుతారు.. ఏవేవో పరిశోదనలు చేసి.. మొత్తానికి కొన్నింటికి పరిష్కారం చెప్తారు. కానీ అలాంటి వారికి సైతం అర్థంకానివి ఎన్నో ఉన్నాయి. ఈ నవరాత్రి రోజుల్లో మీ అందరికీ ఓ ఇంట్రస్టింగ్ ఫ్యాక్టే చెప్పాలని మనలోకం మీ ముందుకు ఈ బీహార్ రాజేశ్వరీ టెంపుల్ ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ టెంపులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే..ఇక్కడ అమ్మవారు మాట్లాడుతుంది. అంటే మన ఊళ్లల్లో ఏదో అమ్మవారు మనిషి మీద పూని మాట్లాడటం కాదు..సాక్షాత్తూ అమ్మవారే మాట్లాడాతారట..ఏంటి నిజమా అనుకుంటున్నారా..అవును నిజమండి..అదేంటో చూద్దాం..!

భారతదేశపు తూర్పుభాగాన ఉన్న బీహార్ రాష్ట రాజధాని పాట్నాలోని బస్తర్ లో ప్రసిద్ధ రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి ఆలయం ఉంది. రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి, దుర్గా దేవి యొక్క అనేక అవతారాలలో రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి కూడా ఒక్కటి అని మనకు తెలిసిన విషయమే.. ఇక్కడ దుర్గా అమ్మవారు భక్తులచే పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం దేశవ్యాప్తంగా వందల వేల మంది భక్తులను ఆకర్షిస్తుంది.

400 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్రా నిర్మించారు. ఇక్కడ రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి యొక్క ప్రధాన విగ్రహమే కాకుండా ఆలయప్రాంగణంలో బతుకు బహీరవ, దత్తాత్రే భైరవ, అన్నపూర్ణ భైరవ, కాల భైరవ మరియు మంగండి భైరవలతో పాటు దేవతలైన బగులముఖి, తారా విగ్రహాలు కుడా ఉన్నాయట.

ఇక్కడే ఉంది ట్విస్ట్.. ఈ ఆలయ ప్రాంగణంలోని అనేక విగ్రహాలు రాత్రి సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాయని స్థానిక ప్రజలతో పడు దుర్గామాత భక్తులు నమ్ముతారు. కొందరు ఇది మూఢనమ్మకం అనుకుంటారు. కానీ ఈ ఆలయంలో కొన్ని వింత వింత శబ్ధాలు వస్తుంటాయి. అవి ఎందుకు వస్తాయి అనేది ఇప్పటివరకూ ఎవరికి అంతుచిక్కని ప్రశ్న.

Raj Rajeshwari Tripura Sundari temple in Bastar

అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్న విషయాల ప్రకారం అర్ధరాత్రి ఈ ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తున్నాయట. తాంత్రిక భవానీ మిశ్రా వంశస్తులే ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు. ఈ ఆలయంలో పూజలు నిర్వహించే పండితులు అర్ధరాత్రి గుడిలోకి వెళ్ళి చూడగా ఆ విషయం పై వారు అమ్మవారి విగ్రహం నుండి ఏదో తెలియని శబ్దాలు అంటే అర్ధం కానీ మాటలు వచ్చాయట. అవేంటి అని మాత్రం అంతుపట్టడం లేదు. ఈ విషయం తెలుసుకోవటానికి వెళ్లిన వైజ్ఞానిక వేత్తలు కూడా ఆ రహస్యం ఛేదించలేకపోయారు.

అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం ప్రత్యేకంగా ఆలయం నిర్మించి ఉంటారని స్థానికులు చెపుతున్నారు. తాంత్రికమైన శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని వారు భావిస్తున్నారు. పూజారులు మాత్రం అమ్మవారు మాట్లాడుతున్నారనే చెబుతున్నారు. ఇప్పటికీ ఈ ఆలయం చాలా మందికి అంతుపట్టని రహస్యంగానే మిగిలింది. ఎంతో మంది ప్రజలు మరియు శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని చూసినవారికి అవి ఒక రహస్యంగానే మిగిలిపోయింది. దేవుడు అంటే ఒక రాతిబొమ్మ మాత్రమే కాదు అని మన పెద్దోళ్లు అంటుంటారు..ఆ విషయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని ఉనికిని ఖచ్చితంగా విశ్వసిస్తారట.

విగ్రహాలు నుండి శబ్దాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలే ధృవీకరించారు. చాలా ఆసక్తిగా ఉన్న ఈ టెంపుల్ గురించి వినగానే ఓ సారి చూడాలనిపిస్తుంది కదా..మీకు అవకాశం వస్తే అస్సలు వదులుకోకండి..మీ స్నేహితుల ఎ‌వరికైనా ఇలాంటి వాటిపై ఇంట్రస్ట్ ఉంటే వెంటనే ఈ ఆర్టికల్ షేర్ చేసేయండి.!

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news