యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే…!

-

మీకు యాభై ఏళ్ళు దాటాయా…? వయసు పైబడుతోందని చింతిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. వయస్సు లో ఉన్నప్పుడు ఏమి తిన్న పరవాలేదు. కానీ వయస్సు పెరిగే కొద్దీ శరీర అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. కనుక ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ విషయం లో మరింత జాగ్రత్త అవసరం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..? శరీరానికి శక్తి చాలా అవసరం.

ఎటువంటి ఆహారం తీసుకోవాలన్న విషయానికి వస్తే.. చేపలు, సముద్ర ఆహారం, నుంచి విటమిన్‌ బీ 12 అందుతుంది. అలానే వృద్ధాప్యం లో మల బద్ధకం ఒక వేధించే సమస్య అనే చెప్పాలి. పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం అధికంగా మీ డైట్ లో చేర్చడం వల్ల ఈ సమస్య ఉండదు. ఇది ఇలా ఉంటె క్యాల్షియం, విటమిన్‌ డి, విటమిన్‌ బీ 12, పీచు, పొటాషియం వంటి ప్రత్యేకమైన పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది కనుక వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. అంతే కాదండి పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల పదార్థాల్లో వృద్ధులకు అవసరమైన పొటాషియం లభిస్తుంది.

ఆకు కూరలు, చేపలు , తక్కువ కొవ్వు పాల పదార్థాలు, తగినంతగా తీసుకోవటం ద్వారా విటమిన్‌ డి, క్యాల్షియం తగినంత పొందవచ్చు. వీటిని కనుక మీరు తీసుకుంటే ఇవి ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయ పడతాయి. వీలైనంత వరకు నూనె పదార్ధాలు, వేపుళ్లు తగ్గించాలి. నెయ్యి, డాల్డా వంటివి కూడా పూర్తిగా తగ్గిస్తే మంచిది. రోజు కాసేపు నడవడం, తేలిక పాటి వ్యాయామాలు చేయడం వంటివి చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆనందంగా ఉంటె మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news