ఈ బియ్యం వండక్కర్లేదు.. నానబెట్టి అన్నం తినొచ్చు!!

-

అన్నం వండావా అంటే ఇంకా లేదు.. ఓ 15 నిమిషాలు ఆగండి కుక్కర్ పెడతా అంటారు ఇంట్లో ఆడోళ్లు. వేళకాని వేళలో మమ్మీ ఆకలి అని పిల్లలు అంటే.. ఓ 10 నిమిషాలు ఆగురా వండి పెడతా అంటారు.. ఇక నుంచి ఈ మాటలు వినిపించవు.. అంటే అన్నం తినం అని కాదు.. వండదు అని కాదు.. అన్నం అంటే ఇప్పుడే నానపెట్టా.. ఓ అర గంట ఆగు వడ్డిస్తా అంటారు. అవును దేశంలోనే ఉత్పత్తి అవుతున్న ఈ రకం బియ్యం.. మరికొన్ని రోజుల్లోనే దేశంలోని అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఉడకని.. నానబెడితే అన్నం తయారయ్యే ఈ రకం బియ్యం విశేషాలు ఏంటో చూద్దాం.

How To Prepare Instant Rice Without Cooking

అసోంలో పండే ఈ బియ్యం విశేషాలు

ఈ బియ్యం పేరు బోకా సౌల్. అందరూ ముద్దుగా మ్యాజిక్ రైస్ అంటారు. దీనికి మరోపేరు కూడా ఉంది.. అదే మ్‌డ రైస్. వీటిని అసోంలోని కొండ ప్రాంతాల్లో పండిస్తున్నారు రైతులు. ఈ పంట సీజన్ జూన్ డిసెంబర్ నెల. ఈ ఆరు నెలలు పంటకు అనుకూలం. దొడ్డుబియ్యంలా లావుగా ఉంటాయి. ఈ బియ్యాన్ని పొయ్యిమీద పెట్టిన ఉడికించాల్సిన అవసరం లేదు. చన్నీళ్లలో ఓ గంట నానబెడితే చాలు.. అన్నం తయారు అవుతుంది. చక్కగా తినేయొచ్చు. మామూలు అన్నంలాగే ఉంటుంది. ఓ కేజీ మామూలు రైస్ వండితే.. ఎంత ఎక్కువ అన్నం వస్తుందో.. అదే విధంగా ఈ మ్యాజిక్ అలియాస్ మ్‌డ రైస్ ను నానబెట్టినా అంతే ఎక్కువ వస్తుంది. ఈ పంట పండించటానికి పురుగు మందలు, రసాయనక ఎరువులు అవసరం లేదు. వీటిని చల్లితే పంట నాశనం అయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. సో.. గ్యాస్ తో పనిలేదు.. కరెంట్ అవసరం లేదు.. కుక్కర్లు కొనాల్సిన అవసరం లేదు.. జస్ట్ ఓ గంట నానబెడితే చాలు అన్నం తయారీ..

పేటంట్ వచ్చింది.. దేశం గుర్తించింది

కొన్ని సంవత్సరాలుగా మ్‌డ రైస్, మ్యాజిక్ రైస్ పండిస్తూనే ఉన్నారు అసోం రైతులు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి పేటెంట్ ఇచ్చింది. దీంతో మరోసారి చర్చనీయాంశం అయ్యింది. పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో ఈ రకం వంగడాన్ని సృష్టించారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. అసోం రాష్ట్ర ప్రజలు పండుగలు, ఫంక్షన్లలో ఈ బియ్యంతో తయారైన అన్నాన్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొఘల్ రాజుల కాలంలో ఇలాంటి బియ్యం ఉత్పత్తి జరిగింది. 17వ శతాబ్దంలో సైనికులు ఇదే ఆహారంగా తీసుకునేవారంట.

పోషక విలువల మాటేంటీ

ఈ బియ్యంపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా గువాహటి యూనివర్సిటీ పరిశోధనల్లో బోకా సౌల్ బియ్యం విశిష్టతను వివరించారు. ఈ బియ్యంలో పీచుపదార్ధం 11శాతం, మాంసకృత్తులు 7శాతం ఉన్నట్లు తేలింది. ఈ అన్నం వల్ల శరీరంలో వేడి కూడా తగ్గుతుంది.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news