రాగిదోశ ఎలా చేయాలో చూద్దాం… రాగులే అని తీసిపారేయకండి!

-

చిరుధాన్యాలలో మైలేనది రాగి అని చెప్పవచ్చు. రాగులే కదా అని చాలామంది కొట్టిపారేస్తుంటారు. కానీ రాగుల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. ఇతర ఏ గింజల్లో లేనంత క్యాల్షియం నిల్వలు రాగుల్లో ఉంటాయి. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎముకల పుష్టికోసం కొందరు క్యాల్షియం మాత్రలను వాడుతుంటారు. వాటికి బదులు రోజూ రాగి జావ తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. రాగుల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి అధిక బరువుతో సతమతమయ్యేవారు వీటిని తీసుకుంటే మంచిది. గోధుమలు, అన్నం కాకుండా రాగులు తీసకుంటుంటే బరువు కంట్రోల్‌ అవుతుంది. అలాంటి రాగులతో రాగిదోశ ఎలా చేయాలో చూద్దాం.

కావాల్సినవి :
రాగిపిండి : ఒక కప్పు
బియ్యం పిండి : అరకప్పు
కొత్తిమీర : 1 కట్ట
అల్లం : చిన్నముక్క
నీళ్లు : తగినన్ని
ఉప్పు : తగినంత
పచ్చిమిర్చి : 1

తయారీ :
పాత్రలో రాగిపిండి, బియ్యంపిండి, రవ్వ, పెరుగు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత పావుగంటపాటు పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లంముక్కను సన్నగా తరిగి వేసుకోవాలి. నాన్‌స్టిక్‌ పాన్‌ను స్టవ్‌పై పెట్టి దేశ పోసుకోవాలి. సాధారణ దోశ మాదిరిగా పాన్‌ మొత్తం అయ్యేలా అనకూడదు. కొద్దిగా నూనె వేసి చిన్న మంటపై కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత తిప్పి మరోవైపు కాల్చుకోవాలి. పుదీనా చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్టే వేరులే..

Read more RELATED
Recommended to you

Latest news