జాగ్రత్త.. తులసి ఆకులను నమిలి తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

-

ప్రతి ఇంటి ఆవరణంలో తెలిసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ఈ తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుసు. ప్రతిరోజూ రెండు లేదా మూడు తులసి ఆకులు తినడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గటమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే తులసి ఆకులను నమిలి తినడం వల్ల తులసి ఆకులలో ఉన్న పాదరసం మన పళ్ళ ఎనామిల్ దెబ్బతినడమే కాకుండా, పంటి రంగును కూడా మార్చేస్తాయని ఢిల్లీకి చెందిన లవ్ నీత్ బ్రాత్ అనే పోషకాహార నిపుణుల వెల్లడించారు.

తులసి ఆకులను నములుతూ ఉన్నప్పుడు అది మన పంటికి అతుక్కుని ఉండడం వల్ల వాటికి హాని కలుగుతుందని పేర్కొన్నారు. తులసి ఆకులలో ఎక్కువ ఆమ్లత్వం కలిగి మన నోరు క్షారత్వం కలిగి ఉండడం వల్ల అయితే ఈ రెండింటి కలయిక ద్వారా దంతాలకు హాని కలుగుతుంది. అయితే తులసి ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాకపోతే వాటిని నేరుగా కాకుండా, వేరే మార్గాల ద్వారా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

కొన్ని తులసి ఆకులను నీటిలో బాగా మరిగించి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని తాగడం ద్వారా దగ్గు గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గడమే కాకుండా, రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

తులసి ఆకుల రసాన్ని, మిరియాల పొడిలో వేసి, ఆ మిశ్రమాన్ని నెయ్యి కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇంకా కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తొలగించుకోవచ్చు.

తులసి రసాన్ని అల్లం రసంతో కలిపి తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది. తులసి రసాన్ని బెల్లంతో కలిపి తీసుకుంటే, కామెర్లు తగ్గుముఖం పడతాయి.

తులసి ఆకులను బాగా ఆరనిచ్చి వాటిని పొడిచేసుకుని, నెయ్యి తో కలిపి చపాతీలోకి తీసుకోవచ్చు.

తులసి ఆకులను డైరెక్టుగా నమలడం కాకుండా, ఇలాంటి పద్ధతులలో వాడడం వల్ల ఎంతో ప్రయోజనం కలిగి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news