వెన్నునొప్పికి చెక్ పెట్టండిలా..

-

వెన్నునొప్పి అనేది మనుషులలో చాలా తరచుగా ఏర్పడే సమస్యలలో ఒకటి. ఇది సాధారణంగా కండరాల నుండి కాని, నరాల నుండి కాని, ఎముకల నుండి కాని, కీళ్ళ నుండి కానీ, వెన్నుపాములోని ఇతర నిర్మాణాల నుండి కాని పుడుతుంది. వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడుతున్న కొందరు చెక్క‌బ‌ల్ల‌పై పడుకుంటారు. అయితే అలా చేయడం వల్ల కండరాలు, ఎముకలు ఒరుసుకుపోయి అసౌకర్యం మరింత పెరుగుతుంది.

మరి కొంతమంది పరుపు లేకుండా పడుకోవాల‌నే ఉద్దేశంతో నేలమీద పడుకొంటారు. అయితే పడుకున్న తర్వాత నేలమీద నుంచి లేవాల్సి వస్తే వంగాల్సి వస్తుంది. దీంతో నడుము నొప్పి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పైగా నేల నుంచి చ‌ల్ల‌ద‌నం, తేమ వంటివి శరీరానికి చేరి న‌డుపు కండ‌రాల‌ను మ‌రింత బిగుసుకుపోయేలా చేస్తుంది. వాస్తవానికి మంచం బేస్ అనేది కుంగిపోకుండా, స్థిరంగా ఉంటే చాలు.


మంచి మంద‌పాటి ప్లైవుడ్ షీట్‌ను మంచం బేస్‌గా ఉపయోగిస్తూ, పరుపును రెండు అంగుళాల మందం ఉండేలా అమర్చుకుంటే సరిపోతుంది. వాటర్ బెడ్స్, ఆర్థోపెడిక్ బెడ్స్ వంటి వాటి వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ, అవి చాలా ఖరీదుతో కూడుకున్నవి. ఈ క్ర‌మంలోనే వెన్నునొప్పి దీర్ఘకాలంగా బాధిస్తున్న‌ప్పుడు రోజువారీ కార్య‌క్ర‌మాల‌న్నింటినీ గమనించాలి. ఎక్కడ, ఏ భంగిమలో, ఏ సందర్భంలో నొప్పి వస్తుందో కనిపెట్టాలి.

వృత్తిపరంగా లేదా రోజువారీగా వాడే వస్తువుల వల్ల నొప్పి వస్తుంటే ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి ఆలోచించాలి. చిన్నపాటి మార్పులు చేర్పులతో రోజువారి కార్యకలాపాలు సౌకర్యవంతంగా నిర్వర్తిస్తే కొంత ఉపశమనం ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు తేలికపాటి ఆహారం తీసుకుంటూ బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. బరువు తగ్గించుకోవడంతో వెన్నుపై పడే భారం తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news