టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నారా..? అయితే ఉదయం 8:30 కి ముందే బ్రేక్ఫాస్ట్ తీసుకోండి…!

-

చాలా మందికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకునే అలవాటు ఉండదు. టైప్2 డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ప్రతి రోజు 8:30 గంటలు ముందే అల్పాహారం తీసుకోవడం చాలా మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వల్ల కలిగే ప్రమాదం ఉండదు అని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు చేసిన పరిశోధన ప్రకారం ఉదయం 8:30 గంటల ముందే అల్పాహారం తీసుకొనే వాళ్ళల్లో తక్కువ బ్లడ్ షుగర్ లెవెల్స్ మరియు తక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటోంది అని పరిశోధన ద్వారా తేలింది అని చెప్తున్నారు.

దీని కారణంగా టైప్2 డయాబెటిస్ వల్ల కలిగే రిస్కు తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా టైప్ 2 డయాబెటిస్ రిస్కు పెరుగుతూ ఉంటుంది అని అంటున్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు అధిక బ్లడ్ షుగర్ లెవెల్స్ కారణంగా వ్యక్తి ఒక మెటబాలిజమ్ ని అది ఎఫెక్ట్ చేస్తుంది.

ఈ పరిస్థితుల్లో ఏకంగా 10,575 మంది పెద్ద వాళ్ళని తీసుకున్నారు. వీళ్లని మూడు గ్రూపులుగా విభజించారు. ఆహారం తీసుకునే సమయాన్ని బట్టి విభజించడం జరిగింది. పది గంటల కంటే తక్కువ, 10 నుంచి 13 గంటలు, 13 కంటే ఎక్కువ ఇలా వేరు చేసారు.

ఆ తరువాత 6 సబ్ గ్రూప్స్ ని చేశారు. ఇలా జరిగిన పరిశోధనలో ప్రతి రోజు ఉదయం 8:30 గంటల ముందే అల్పాహారం తీసుకున్న వాళ్లలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు షుగర్ లెవెల్స్ బాగున్నాయి అని గమనించారు. కాబట్టి టైప్ 2 డయాబెటిస్ తో బాధ పడే వాళ్ళు ప్రతి రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ముందే అల్పాహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచించారు. అలా దీని వల్ల కలిగే రిస్కు కూడా తగ్గుతుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news