ఎనిమిదో తరగతి చదివిన వ్యక్తి నేడు 12000 కోట్ల కంపెనీకి యజమాని..!!

-

చిరుతిండి వ్యాపారం అత్యంత ప్రసిద్ధ వ్యాపారాలలో ఒకటి. భారతీయులు రకరకాల ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. స్వీట్స్‌, హాట్‌ ఐటమ్స్‌, కరకరలాడే చిప్స్‌ అంటే మనకు ఎంత ఇష్టమో.. స్నాక్స్‌ గురించి మాట్లాడినప్పుడు మనకు వెంటనే గుర్తుకువచ్చే పేరు..హల్దీరామ్.. ఇది పేరు కాదు. .బ్రాండ్‌.. ఇప్పటిది కాదు..  వందేళ్ల చరిత్ర కలిగిన కంపెనీ ఇది. గంగాబిషన్ అగర్వాల్, హల్దీరామ్ వ్యవస్థాపకుడు. ఎనిమిదో తరగతి చదివిన ఇతను ఇప్పుడు 12000 కోట్ల టర్నోవర్‌తో సక్సస్‌ఫుల్‌గా వ్యాపారం చేస్తున్నాడు. ఈరోజు మనం ఈ స్టోరీ గురించి తెలుసుకుందాం.
హల్దీరామ్ 1918లో ఒక చిన్న దుకాణం నుండి ప్రారంభించారు. ఇప్పుడు ఈ కంపెనీ వార్షిక ఆదాయం 12000 కోట్ల రూపాయల కంటే ఎక్కువే. హల్దీరామ్ కంపెనీ యజమాని గంగాబిషన్ అగర్వాల్. బికనీర్‌లో చిన్న దుకాణం ప్రారంభించాడు. అతను బికనీర్ షాపులో భుజియా తయారు చేసేవాడు. సంప్రదాయ స్వీట్లను అమ్మేవారు. నిజానికి గంగాబిషన్ అగర్వాల్‌ను అతని తల్లి హల్దీరామ్ అని పిలిచేది. గంగాబిషన్ అగర్వాల్ తన తల్లి తనను పిలుస్తుండడంతో దుకాణానికి అదే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆ దుకాణానికి హల్దీరామ్ అని పేరు పెట్టాడు.
అతను బికనీర్‌లో దుకాణం ప్రారంభించడానికి ఒక కారణం ఉంది. 1918లో పదేళ్ల గంగాబీషన్ తన తండ్రి దుకాణంలో పనిచేసేవాడు. గంగాబీషన్ ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివాడు. ఈ సమయంలో, గంగాబిషన్ అగర్వాల్ తన అత్త నుండి భుజియా ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. కుటుంబీకుల మధ్య గొడవ జరిగింది. దీంతో గంగాబిషన్ అగర్వాల్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బికనీర్‌కు వచ్చి అక్కడ దుకాణం ప్రారంభించాడు. అతను 1937 లో తన సొంత దుకాణాన్ని ప్రారంభించాడు.
ఈ దుకాణంలో భుజియా విక్రయించే గంగాబిషన్ అగర్వాల్ తన వంట పద్ధతిలో చిన్న మార్పు చేశాడు. కాబట్టి కస్టమర్‌లు వారి భుజియాను ఇష్టపడ్డారు. భుజియాకు రోజురోజుకూ డిమాండ్ పెరిగింది. ఓ వివాహ వేడుక నిమిత్తం కోల్‌కతా వచ్చిన గంగాబిషన్ అగర్వాల్ అక్కడ కూడా భుజియాకు గిరాకీ ఉండటాన్ని గమనించాడు. అక్కడే దుకాణం కూడా ప్రారంభించాడు. అంతటితో ఆగలేదు.. తమ వ్యాపారాన్ని మహారాష్ట్రలోని ఢిల్లీ, నాగ్‌పూర్‌లకు విస్తరించారు. నేడు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో హల్దీరామ్ దుకాణాలు ఉన్నాయి. హల్దీరామ్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పేరు తెచ్చుకుంది. హల్దీరామ్ ఉత్పత్తులు 50 దేశాలలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
2023లో హల్దీరామ్ ఆదాయం 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. హల్దీరామ్ కొన్నేళ్లలో ఐపీఓను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. హల్దీరామ్ ప్రారంభించి ఇన్ని సంవత్సరాలైనా ఉత్పత్తుల నాణ్యతలో రాజీ పడలేదు. నాణ్యత మరియు రుచికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హల్దీరామ్ కూడా టాప్ కంపెనీల జాబితాలో ఉంది. హల్దీరామ్ కంపెనీ రసగుల్లా, గులాబ్ జామూన్ మరియు సోన్ పాప్డి వంటి స్వీట్లు, నామ్‌కీన్ మరియు భుజి వంటి రుచికరమైన స్నాక్స్, సమోసా, కచోరీ వంటి రెడీ మీల్స్‌తో సహా చోలే భాతురును తయారు చేస్తారు. దాదాపు హల్దీరామ్ యొక్క నమ్కీన్స్ అన్నీ బాగుంటాయి. నింబు మసాలా, భేల్ పూరీ మిక్స్, డ్రై ఫ్రూట్ మిక్స్, ఖట్టా మీఠా మిక్స్ మొదలైనవి హల్దీరామ్ యొక్క ప్రసిద్ధ ఆహారాలు.

Read more RELATED
Recommended to you

Latest news