న‌క్క తోక తొక్కొచ్చాడేమో.. ఏకంగా 23 కోట్ల లాటరీ ప‌ట్టాడు..

-

అదృష్టం.. దురదృష్టం ఎవ‌రిని ఎలా వెంటాడ‌తాయో ఎవ‌రికి తెలియ‌దు. అయితే కర్ణాటకలోని మహ్మద్​ ఫయాజ్​కి మాత్రం చిన్నతనం నుండి అన్ని దురదృష్టాలే వెంటాడాయి. తన కన్న తల్లిదండ్రులిద్దరూ కిడ్నీ జబ్బుతో చనిపోయారు. ఇక మంచిగా చదువుకొని దుబాయ్ వెళ్లి ఉద్యోగం చేసుకొని గొప్పగా బ్రతకాలి అనుకున్నాడు. కానీ అది కూడా కలలాగే మిగిలిపోయింది.

ప్రస్తుతం ముంబైలోని ఓ కంపెనీలో అకౌంటెంట్ గా జాబు చేస్తున్నాడు. అయితే మనకు కూడా ఎప్పుడో ఒకసారి అదృష్టం రాక‌పోతుందా అని ఎదురుచూసాడు. ఈ క్ర‌మంలోనే ఆరు సార్లు లాటరీ టికెట్ కొన్నాడు. చివరగా అతడిని అదృష్టం వరించింది. ఏకంగా ఆ లాటరీలో 23 కోట్లు తగిలాయి. దీంతో ఒక్క‌సారిగా కోటీశ్వ‌రుడు అయిపోయాడు. వారి ఆనందాల‌కు అవ‌దులు లేదు. అయితే మహ్మద్​ ఫయాజ్‌ వచ్చినా డబ్బుతో తన సోదరుడుని చదివిస్తానని సంతోషంగా చెపుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news