షాకింగ్ : నల్లగా ఉందని భార్యను చంపిన భర్త

-

కరోన కాలంలోనూ నేరాలు ఏమాత్రం తగ్గడం లేదు. సిల్లీ రీజన్స్ కోసం హత్యలు కూడా చేసేస్తున్నారు. భార్య నల్లగా ఉందని ఆమెను భర్త చంపేసిన వైనం మియాపూర్ లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే అనంతపూర్ కి చెందిన యోగి అనే వ్యక్తికి ఆరు నెలల క్రితం అతని మేనకోడలు అరుణతో వివాహం జరిగింది. ఆమెను యోగి ఇరవై రోజుల క్రితం అరుణ హైదరాబాద్ తీసుకు వచ్చి కాపురం పెట్టాడు.

murder
murder

యోగి ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయకుండా మేనకోడలుతో పెద్దలు బలవంతపు వివాహం చేశారు. ఇష్టం లేకపోయినా ఆరు నెలలుగా అరుణతో కాపురం చేస్తూ వస్తున్నాడు యోగి. ఈరోజు ఏమయిందో తెలీదు భార్యను చంపి తాను కూడా చనిపోయేందుకు గొంతు కోసుకున్నాడు. అయినా చావనేమో అని ఫినాయిల్ కూడా తాగి ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. సకాలంలో స్పందించిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news