అధికారుల నిర్లక్ష్యంతోనే ఇంధిరాపార్క్ లో మంటలు…

-


తెరాస అధినేత కేసీఆర్ పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఉదయం ఇందిరాపార్క్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వాకర్స్ భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపుచేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ప్రతీ రోజు వచ్చే వాకర్స్ సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇందిరా పార్క్‌లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెత్త చెదారంతో ఇందిరా పార్క్‌ డంపింగ్‌ యార్డ్‌లా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస అధినేత అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‍ ఇందిరా పార్క్ విషయంలో అనేక సార్లు తనను బెదిరించినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news