అమిత్‌ షా – ఎన్టీఆర్‌ భేటీపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్‌

-

భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆదివారం సమావేశం అయిన విషయం తెలిసిందే. మొత్తం 45 నిమిషాల సేపు సాగిన సమావేశంలో 20 నిమిషాలు ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. వీరిద్దరి సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి భేటీ పై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. వారి భేటీని ఉద్దేశించి.. చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు.

గుండె రాయి చేసుకొని భరించక తప్పదు బాబన్నా. నువ్వేం చూడకూడదు అనుకుంటావో అవే దృశ్యాలు పగబట్టినట్టు తరుముతున్నాయంటూ ఎద్దేవా చేశారు. తండ్రీకొడుకులు ఒకరినొకరు ఓదార్చుకోండి. బయటి వాళ్లు సర్ది చెప్పే విషయం కాదాయె. రేపు కుప్పంలో ఇవే స్లోగన్లు వినిపిస్తాఏమో! అంటూ చురకలు అంటించారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబుని బిజెపి మళ్లీ చేరదీస్తుందా అన్నది బీజేపీ అంతర్గత విషయం. ఒకటి మాత్రం నిజం. విలువల్లేని టీడీపీతో పొత్తు అనేది బిజెపి స్థాయిని తగ్గిస్తుంది. దరిద్రాన్ని ఎవరైనా కోరి చంకన పెట్టుకుంటారా? అని సెటైర్‌ వేశారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news