ఆరు గ్యారెంటీలను ఆచరణలోకి తీసుకొస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ

-

మెదక్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా ఆచరణలోకి తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ 10 లక్షలతో ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తోందని , ఇప్పటికే మహిళలకు మహాలక్ష్మి పథకం పేరిట ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని గుర్తు చేశారు.

ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ల స్థలాలు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు అందజేస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఒక విజన్‌ ఉందని అన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ పాలనను ప్రజలకు అందించామని చెప్పారు. రాజకీయం శాశ్వతం కాదని వ్యవస్థ ముఖ్యమని అన్నారు ఆయన. తాను విద్యా శాఖ మంత్రిగా ఉన్న కాలంలో మోడల్ స్కూల్స్, కేజీబీవీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news