ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనున్న తితిదే…

-

కలియుగ వైకుంఠం  తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే శుక్రవారం విడుదల చేయనుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో స్వామివారి సేవలో పాల్గొనేందుకు వీలుగా వివిధ ఆర్జిత సేవా టిక్కెట్లను www.tirumala.org  ద్వారా ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి తేనుంది. సుప్రభాతం, తోమాల, అష్టదళ పాదపద్మారాధన, అర్చన,  నిజపాద దర్శనం టిక్కెట్లను లక్కీడిప్‌ విధానంలో ఆన్‌లైన్‌లో జారీ చేయనుంది. విశేషపూజ, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కరెంటు బుకింగ్‌ కింద వెంటనే బుక్‌ చేసుకోవచ్చు. దాదాపు 50 వేల వరకు విడుదల చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news