ఆ సిలబస్‌నే ప్రస్తుత టెట్‌కు కూడా నిర్ణయించాం : ఏపీ విద్యాశాఖ కమిషనర్

-

ఆంధ్ర ప్రదేశ్ లో టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ కంటే ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్‌ను విద్యాశాఖ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్‌, షెడ్యూల్, సిలబస్ తదితర వివరాలు ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.

అయితే, టెట్‌ (జులై) పరీక్షకు పాత సిలబస్ ఉంచినట్లుగా నెట్టింట్లా ప్రచారం జరుగుతోందని, ఇది వాస్తవం కాదని ఆయన తెలిపారు. దీనిపై అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని ఆయన సూచించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నిర్ణయించిన సిలబస్‌నే ప్రస్తుత టెట్‌కు కూడా నిర్థారించినట్లు ఆయన వెల్లడించారు. అందువల్ల దాన్నే వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు, సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావాలని సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news