ఇలా అయితే కోటీశ్వరులవ్వడం ఎవరూ ఆపలేరు!

-

ప్రతి వ్యక్తి చేసే పని కూడు గుడ్డ నీరు తర్వాత కాసిన్ని డబ్బులను వెనక్కి వేసేందుకు ప్రయత్నిస్తారు. మన లక్ష్యాలను బట్టి పెట్టుబడులు ఉండాలి 25 సంవత్సరాల తరువాత కనీసం రూ.1.5 కోట్ల వరకు సంపాదించాలనుకునేవారికి ఈ ప్లాన్‌ చాలా బావుటుంది.

కరోనా నేపథ్యంలో బ్యాంకుల వడ్డీరేట్లు తగ్గిపోయాయి. దీంతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆధారపడే సంప్రదాయ పెట్టుబడిదారులు, సీనియర్‌ సిటిజన్లకు అందే రాబడిలో కోత పడుతోంది. దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించే చిన్న పెట్టుబడులకు ప్రస్తుతం డిమాండ్‌ ఎక్కువగా ఉంది. దీన్ని గుర్తించిన మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌లు నెలవారీగా కొంత మొత్తాన్ని పెట్టుబడులకు కేటాయించే సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లను రూపొందించాయి. ఈ స్కీములు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటి ద్వారా ఉద్యోగ విరమణ తరువాత పెద్ద మొత్తంలో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్‌ కాలిక్యులేటర్‌ ప్రకారం ఒక వ్యక్తి నెలకు రూ.8,000 పెట్టుబడి పెడితే రూ.1.51 కోట్లు, నెలకు రూ.9,000 పెట్టుబడి పెడితే సుమారు రూ.1.7 కోట్ల వరకు సంపాదించవచ్చు.ఈ విధంగా పెట్టుబడులు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

15 సంవత్సరాల వరకు చేసే దీర్ఘకాలిక పెట్టుబడులపై కనీసం 12 శాతం రాబడిని పొందవచ్చని ట్రాన్సెండ్‌ కన్సల్టెంట్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ కార్తిక్‌ ఝవేరి చెబుతున్నారు. అదే 20 సంవత్సరాలకు మించి ఉండేలా ఎంచుకుంటే.. ఎంచుకున్న మ్యూచువల్‌ ఫండ్‌ ప్లాన్‌ ను బట్టి 15 శాతం వరకు రాబడి లభిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎంచుకున్న మ్యూచువల్‌ ఫండ్‌ వార్షిక రాబడి 12 శాతంగా ఉంటుందనుకుందాం. అతడు 25 సంవత్సరాల వరకు నెలకు రూ.8,000 పెట్టుబడి పెడితే… మెచూరిటీ తరువాత అందే మొత్తం రూ.1,51,81,081.సదరు వ్యక్తి పెట్టుబడి చేసిన మొత్తం రూ.24,00,000. దీనికి ఈ 25ఏళ్లలో లభించే వడ్డీ రూ.1,27,81,081.

లక్ష్యాలను బట్టి పెట్టుబడులు ఉండాలి 25 సంవత్సరాల తరువాత కనీసం రూ.1.5 కోట్ల వరకు సంపాదించాలనుకునేవారు.. నిర్దేశించుకున్న మొత్తంపై కనీసం రూ.500 నుంచి రూ.1,000 వరకు ఎక్కువగా పెట్టుబడి పెట్టాలి. రూ.1.5 కోట్ల వరకు సంపాదించాలనుకునే మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారుడు.. నెలకు రూ.9,000 పెట్టుబడి పెడితే మెచూరిటీ తరువాత వచ్చే రాబడిపై భరోసా ఉంటుంది. ఉదాహరణకు.. 25 సంవత్సరాల మెచూరిటీ ఉండే మ్యూచువల్‌ ఫండ్‌ సిప్‌లో నెలకు రూ.9,000 పెట్టుబడి పెట్టారనుకుందా.12 శాతం వడ్డీని అంచనా వేస్తే మొత్తం రూ.1,70,78,716కు చేరుకుంటుంది. దీంట్లో నికర పెట్టుబడులు రూ.27,00,000, దీనిపై పెట్టుబడిదారుడికి వచ్చే వడ్డీ రూ.1,43,78,716. ఇప్పటి నుంచే మీరు వేలలో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌ పెడితే ఇలా నిర్ధిష్ట సమయంలో కోటీశ్వరులు అవ్వడం సులభం.

Read more RELATED
Recommended to you

Latest news