ఏపీలో ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక శుభవార్తను అందించింది. ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కొందరిని బదిలీ చేయడానికి సమ్మతించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఇంతకు ముందు ఈ విషయంలో నిషేధం ఉండగా.. ఇప్పుడు దానిని సడలిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మే 22 నుండి 31 మధ్యన ఈ బదిలీలు జరుగనున్నాయి. కాగా ఈ బదిలీలకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఒకచోట రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన వారు రిక్వెస్ట్ చేసుకుంటే బదిలీకి అవకాశం కల్పించనున్నారు.

5 సంవత్సరాల పాటు తమ సర్వీస్ ను పూర్తి చేసిన వారికి మొదటి ప్రయారిటీ ఇచ్చే చాన్సు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2023 వరకు అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు ఇందుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news