ఏపీలో రెండ్రోజులు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌..!

-

నేడు, రేపు ఎపిలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. రెండు రోజుల పాటు ఎపిలో జ‌న ఆశీర్వాద్ యాత్ర లో కిష‌న్ రెడ్డి పాల్గొంటారు. క్యాబినెట్ లో ప్ర‌మోష‌న్ పొందిన కేంద్ర మంత్రుల ప‌ర్య‌ట‌న‌ల్లో బాగంగా జ‌న ఆశీర్వాద్ యాత్రలో ఆయ‌న పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం 4.30 గంట‌ల‌కు చిత్తూరు జిల్లా రేణిగుంట కు కిష‌న్ రెడ్డి చేరుకుంటారు. తిరుప‌తి లో పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లుకుతారు.

kishan-reddy
kishan-reddy

అక్క‌డ వారితో క‌లిసి ర్యాలీలో పాల్గొని..మీటింగ్ నిర్వ‌హిస్తారు. ఇక కిష‌న్ రెడ్డి రేపు ఉద‌యం శ్రీ‌వారి ద‌ర్శ‌నం అనంత‌రం తిరుప‌తిలో వ్యాక్సిన్ సెంట‌ర్ ను సంద‌ర్శిస్తారు. రేపు ఉదయం 11 గంట‌ల‌కు ప్ర‌త్యేక విమానంలో కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రంకు చేరుకుంటారు. దుర్గ‌ గుడి లో అమ్మ‌వారి ద‌ర్శ‌నంతో పాటు ప‌లు పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొన‌నున్నారు. అనంత‌రం రోడ్డు మార్గంలో తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి బ‌య‌లుదేరుతారు.

Read more RELATED
Recommended to you

Latest news