ఐరాస సదస్సులో సీఎం కీలకోపన్యాసం

-

న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో  ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావం’  అనే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీడపీడల లేని కాలుష్య రహిత సాగును ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందన్నారు.

ఎలాంటి రసాయనాలు, ఎరువులను వాడకుండా రైతులు సాగు చేస్తున్నారని వివరించారు.  ఇప్పటికే ఈ తరహా సేద్యం లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చేయడం, 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను అంతర్జాతీయ వేదికపై చంద్రబాబు ఆవిష్కరించారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్‌ సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై ఆయన చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news