ఐసీఎస్‌ఐలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసేయండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. హరియాణా రాష్ట్రం మనేసర్‌లో ఉన్న ఈ సంస్థ లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అయితే ఈ పోస్టులని కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్‌ లో భాగంగా మొత్తం 40 సీఆర్సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక వయస్సు విషయానికి వస్తే.. 01-12-2022 నాటికి 31 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా సభ్యత్వం ఉండాలి.

అలానే పని అనుభవం కూడ తప్పనిసరి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సాలరీ విషయానికి వస్తే రూ. 33,000 నుంచి రూ. 40,000 గా వుంది. ఈ పోస్టులకి ఎంపికైతే హరియాణాలోని సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్, కార్పొరేట్ భవన్, ఐఐసీఏ, మనేసర్‌లో పని చెయ్యాల్సి వుంది. ఈ పోస్టులకి అప్లై చేసేందుకు చివరి తేదీ 30-12-2022. కనుక ఈలోగా అప్లై చేసుకోవడం మంచిది. పూర్తి వివరాలని https://www.icsi.edu/home/ లో చూసి తెలుసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news