కెసిఆర్ ని ఎవరు ఏం చేయలేరు – కేటీఆర్

-

నేడు వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగిలో 3 కోట్ల 50 లక్షలు నూతనంగా నిర్మించిన కేజీబీవీని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పొద్దున లేస్తే కొందరు నాయకులు సీఎం కేసీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు శాపనార్ధాలు పెడితే.. ప్రజలే కాపాడాలన్నారు. ప్రజల ఆశీస్సులు ఉంటే.. కెసిఆర్ కి ఎవరు ఏం చేయలేరని అన్నారు మంత్రి కేటీఆర్. గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదని ఆరోపించారు.

ఎమ్మెల్యే రమేష్ బాబు నేతృత్వంలో వేములవాడ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి మహారాష్ట్రలోని 14 గ్రామాల సర్పంచులు, ప్రజలు తమను తెలంగాణలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్ ని కోరుతున్నారని తెలిపారు. అలాగే మహబూబ్నగర్ పక్కన ఉన్న కర్ణాటకలోని రాయచూరు ప్రజలు కూడా తెలంగాణలో కలపాలని కోరుతున్నారని.. అక్కడి ఎమ్మెల్యే, మంత్రి ముందే మమ్మల్ని కూడా తెలంగాణలో కలపాలని అడుగుతున్నారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news