క్రికెటర్ అంబటి రాయుడుపై అమరావతి రైతుల ఆగ్రహం … !

-

మాజీ ఇండియా క్రికెటర్ అంబటి రాయుడు ఈ మధ్యన ఆంద్రప్రదేశ్ రాజకీయాల గురించి చురుకుగా మాట్లాడుతూ ఎంట్రీ ఇవ్వడానికి సరైన సమయం కోసం వేచిచూస్తున్నట్లు ఉన్నాయి. రాయుడు పొలిటికల్ ఎంట్రీ కంఫర్మ్ అయితే మాత్రమే అది ఖచ్చితంగా వైసీపీకి అన్నది తెలిసిపోయింది. కాగా తాజాగా అంబటి రాయుడు అమరావతి ప్రాంతం వెలగపూడిలో ఉన్న శివాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ అమరావతి రైతులు రాయుడిని కలిసి కొంచెం సేపు మాట్లాడారు, ఈసందర్భంగా వారి సమస్యలను వివరించే ప్రయత్నం చేయగా అంబటి రాయుడు నాకు సమయం లేదని మరోసారి వస్తానని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రైతులు మా సమస్యలకు మీరు మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు.. కనీసం మా బాధలు వినండి అంటున్నా పట్టించుకోకుండా వెళ్లిపోవడం బాధాకరం.

ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది… ప్రజల సమస్యలు వినకుండా వెళ్ళిపోతే రేపు రాజకీయంగా ఎవరు నీకు మద్దతుగా ఉంటారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news