తెలంగాణ వరద బాధితులకు టీడీపీ సాయం

-

తెలంగాణ వరద బాధితులకు టీడీపీ సాయం చేయనుందని టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగిందని.. వరంగల్ జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని వెల్లడించారు. భారీ వర్షాలకు ఆపర పంట నష్టం జరిగిందని.. తెలంగాణ సర్కార్ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ భారీ నష్టం అన్నారు.

చనిపోయిన కుటుంబానికి 25 లక్షల నష్ట పరిహారం, ఎకరానికి 20వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టిడిపి పార్టీ తరపున వరద ప్రాంతాల్లో దుప్పట్లు.. నిత్యావసర సరుకులు పంపిణీ చేయబోతున్నామని ప్రకటించారు. GHMC పరిధిలో వరద భాదితులకు 10వేల హామీ ఏమైంది ? అని నిలదీశారు. సకాలంలో వరద ప్రాంతాల్లో హెలి కాప్టర్ పంపలేదు. అందుకే ప్రాణ నష్టం జరిగిందని ఫైర్‌ అయ్యారు కాసాని జ్ఞానేశ్వర్.

Read more RELATED
Recommended to you

Latest news