జాతిపితకు ఘన నివాళి

-

జాతిపిత మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ  సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రముఖులు మహాత్ముడికి నివాళులులర్పించారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పలువురు జాతీయ నేతలు మహాత్ముడికి ఘన నివాళులర్పించారు.

తెలుగు రాష్ట్రాల్లో ని గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాంధీ విగ్రాహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశాన్ని అహింస, సత్యాగ్రహా సిద్ధాంతాలతో ఉన్నత స్థానంలో నిలిపిన మహానీయుడు మహాత్మగాంధీ అంటూ కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news