తెలంగాణలో డబుల్ డిజిట్ లో లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటాం- కిషన్ రెడ్డి

-

వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి డబుల్ డిజిట్లో సీట్లను సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో ఆశించిన మేర సీట్లను దక్కించుకోకపోయినా గతంలో కంటే మంచి ఫలితాలను సొంతం చేసుకుందని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని బిజెపి పార్టీ తక్కువ సీట్లకి పరిమితం అయిన విషయం తెలిసిందే.

మోడీని ప్రధానమంత్రిగా మూడోసారి గెలిపించుకునేందుకు దేశంలోని ప్రజలు, రాష్ట్ర ప్రజానీకం వేచి చూస్తుందని అన్నారు. డిసెంబర్ 28వ తేదీన రంగారెడ్డి జిల్లా కొంగర్ సమీపంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో విస్తృతమైన సమావేశాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల కార్యచరణ సిద్ధం చేసినట్లు మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు హాజరవుతారని వెల్లడించారు

Read more RELATED
Recommended to you

Latest news