తెలంగాణ లో 6వేల టీచర్ పోస్టులు..భర్తీ ఎప్పుడంటే.. ?

-

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేస్తున్నారు. హేతుబద్ధీకరణ అనంతరం రాష్ట్రంలో ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులు ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హేతుబద్ధీకరణ అనంతరం తక్కువ మంది విద్యార్థులు ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్లయితే వారిని తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు పంపించనున్నారు.

అయితే ఉపాధ్యాయులను బదిలీ చేశాక రాష్ట్రంలో కనీసం ఆరు వేల టీచర్ పోస్టుల ఖాళీలు ఉండే అవకాశం ఉన్నట్టు విద్యాశాఖ భావిస్తోంది. ఈ మిగిలిన పోస్టులను డీ ఈ ఓ వద్ద ఉంచబోతున్నారు. భవిష్యత్తులో ఒకవేళ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినట్లయితే అప్పుడు వీటిని భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక ఈ రోజు హేతుబద్ధీకరణ కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. 0 నుండి 19 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల కు కూడా ఒక టీచర్ ను నియమించనున్నారు. ఇరవై నుండి అరవై మధ్య విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులని నియమిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news